- Advertisement -
ముంబయి: రాజకీయాల్లో మహిళలు టార్గెట్ అవుతున్నారని శివసేన నాయకురాలు, బాలీవుడ్ నటి ఊర్మిళామతోడ్కర్ అన్నారు. రాజకీయాలు భయానక విషవలయంగా మారాయని, ఇది ఎవరినీ ఆశ్చర్యపరచడంలేదని ఆమె విమర్శించారు. సీనియర్ జర్నలిస్ట్ బర్ఖాదత్ శుక్రవారం రాత్రి ఉయ్ ద ఉమెన్ పేరుతో నిర్వహించిన వర్చువల్ కార్యక్రమంలో ఆమె తన అభిప్రాయాలను వెల్లడించారు. తాను మాత్రం ప్రజల కోసం మంచి పనులు చేయడంపైనే దృష్టి సారిస్తానని ఊర్మిళ అన్నారు. ఈ వర్చువల్ సమావేశంలో బిజెపి నాయకురాలు కుష్బూ, టిఎంసి ఎంపి నుస్రత్జహాన్ కూడా పాల్గొన్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున నార్త్ ముంబయి నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఊర్మిళ, ఆ తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇటీవలే శివసేనలో చేరారు.
- Advertisement -