Sunday, May 5, 2024

17 ఏళ్ల బాలికతో లేచిపోయిన 20 ఏళ్ల యువతి…..

- Advertisement -
- Advertisement -

భోపాల్: 17 ఏళ్ల బాలికతో 20 ఏళ్ల యువతి లేచిపోయి వివాహం చేసుకున్న సంఘటన మధ్య ప్రదేశ్‌లోని గునా టౌన్ ప్రాంతం కోట్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బుధే బాలాజీ ప్రాంతలో 17 ఏళ్ల బాలికతో 20 ఏళ్ల యువతి కలిసి మెలిసి ఉండేది. బాలికకు మాయమాటలు చెప్పి యువతి మైనర్ ను తీసుకెళ్లింది. అనంతరం పెళ్లి చేసుకొని శివపూరీ జిల్లాలో నివసిస్తోంది. తన కూతురు కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాలిక బంధువుల ద్వారా ఆమె ఉన్న స్థలాన్ని గుర్తించి వారిని పట్టుకున్నామని స్థానిక ఎస్‌పి టిఎస్ బఘేల్ తెలిపారు. బాలికకు పోలీసులు కౌన్సిలింగ్ ఇప్పించి ఇంటికి పంపించారు. పోస్కో యాక్ట్ కింద కేసు నమోదు చేసి సదరు యువతిని అరెస్టు చేసి పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News