Wednesday, May 8, 2024

వివాహితను నగ్నంగా ఊరేగించారు….

- Advertisement -
- Advertisement -

గాంధీనగర్: ప్రియుడితో పారిపోయిన వివాహితను వివస్త్రం చేసి ఊరేగించిన సంఘటన గుజరాత్‌లోని దహోడ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఓ వివాహిత (23) నెల రోజుల క్రితం ప్రియుడితో కలిసి లేచిపోయింది. దీంతో ఆమె కోసం భర్త, బంధువులు, గ్రామస్థులు వెతికారు. ఎక్కడా ఆమె ఆచూకీ కనిపించలేదు. చివరకు ఓ గ్రామంలో ఆమె కనిపించడంతో తిరిగి సొంతూరుకు తీసుకొచ్చారు. వివాహం జరిగిన తరువాత మరో వ్యక్తితో పారిపోవడంతో ఆమెను బంధువులు, భర్త తీవ్రంగా కొట్టారు. అనంతరం ఆమెను వివస్త్రం చేసి ఊరేగించారు. భర్తను భూజాన ఎత్తుకొని గ్రామంలో తిరిగాలని గ్రామపెద్దలు ఆదేశించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి 18 మంది అరెస్టు చేశామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News