Sunday, April 28, 2024

900 మంది ఉద్యోగులపై షియోమీ వేటు

- Advertisement -
- Advertisement -

Xiaomi lays off 900 employees

న్యూఢిల్లీ: చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమీ 900 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్‌లో నివేదిక ప్రకారం, ఆర్థిక మందగమనం నేపథ్యంలో షియోమీ తన ఉద్యోగులలో 3 శాతం మందిని తొలగించింది. అయితే ఈ విషయాన్ని షియోమి ఇంకా ధృవీకరించలేదు. రెండో త్రైమాసికంలో కంపెనీ ఆదాయంలో భారీగా క్షీణత నమోదవగా, అమ్మకాలు వార్షికంగా చూస్తే 20 శాతం పడిపోయి 70.17 బిలియన్ యువాన్లకు (10.31 బిలియన్ డాలర్లకు) చేరుకున్నాయి. స్మార్ట్‌ఫోన్ తయారీదారు నికర ఆదాయం 67 శాతం తగ్గి 2.08 బిలియన్ యువాన్‌లకు చేరుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. షియోమి ప్రెసిడెంట్ వాంగ్ జియాంగ్ ఆదాయాల కాల్‌లో మాట్లాడుతూ, కరోనా మహమ్మారి మరోసారి చైనా మార్కెట్‌ను ప్రభావితం చేసిందని, డిమాండ్, సరఫరా రెండూ తగ్గాయని అన్నారు. ఇంధన ధరలు పెరగడం, ఖర్చులు, ద్రవ్యోల్బణం కూడా విదేశీ విక్రయాలపై ప్రభావం చూపాయని అన్నారు. విక్రయాలు, ప్రమోషన్ల ద్వారా జాబితాను స్థిరంగా ఉంచేందుకు ఏర్పడిన ఒత్తిడి ఫలితంగా నికర లాభం తగ్గింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News