Friday, May 3, 2024

యాదాద్రి ఆలయం త్వరలోనే ప్రారంభం

- Advertisement -
- Advertisement -

Yadadri Temple will be inaugurated soon:KTR

మంత్రి కెటిఆర్ ట్వీట్
మన తెలంగాణ/హైదరాబాద్: యాదాద్రిలో అద్భుతమైన శిల్ప సౌరభాల తో పునర్నిర్మించిన యాద్రాద్రి లక్ష్మీనృసింహస్వామి ఆలయం త్వరలో ఆ విష్కరించనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కెటి ఆర్ ఆదివారం నాడు ట్వీట్ చేశారు. భారతీయులందరికీ పర్యాటక కేం ద్రంగా తీర్చిదిద్దాలన్న సిఎం కెసిఆర్ దార్శనికతకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌లో యాదాద్రి ఆలయానికి సంబంధించిన వీడియో ను ట్వీట్ చేశారు. అడుగడుగునా ఆధ్యాత్మికత ఉట్టి పడే కట్టడాలు.. ఒద్దిక గా పొదిగిన అందమైన కృష్ణరాతి శిలలు రాజసంగా కొలువుదీరిన సప్తరా జ గోపురాలు, గర్భగుడి ముఖద్వారం, ధ్వజ స్తంభానికి బంగారు తొడు గులు ఇలా ప్రతి అంగుళం భక్తులు తన్మయత్వం చెందేలా, భక్తిభావం ఉప్పొంగేలా తీర్చిదిద్దిన ఆలయం ఆకట్టుకుంటున్నది. ప్రస్తుతం ఆలయ పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరాయి. ఈ క్రమంలో ఆలయ ఉద్ఘాట నకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజల కు ఆలయ నిర్మాణం విశిష్టతను తెలిపేందుకు మంత్రి కెటిఆర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియో చిత్రాలు అద్భుతంగా ఉన్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News