Saturday, April 27, 2024

వైసిపి ఎంఎల్‌సి కరిమున్నీషా కన్నుమూత

- Advertisement -
- Advertisement -

అమరావతి: వైసిపి ఎంఎల్‌సి ఎండి కరిమున్నీషా కన్నుమూశారు. శుక్రవారం  అర్ధరాత్రి సమయంలో గుండెపోటుతో ఆమె తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. శాసన మండలి సమావేశాలు అనంతరం ఆమె ఇంటికి వచ్చారు. ఛాతీలో అస్వస్థతగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పడంతో స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె చనిపోయారు. కరీమున్సీషాకు భర్త, ఐదుగురు కుమారులు ఉన్నారు. ఆమె మృతిపట్ల వైసిపి నాయకులు సంతాపం తెలిపారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గత సంవత్సరం నుంచి ఎంఎల్‌సిగా సేవలందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News