- Advertisement -
అమరావతి: భారీ వర్షాలు కురుస్తుండడంతో భవనం కూలి ఇద్దరు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా కదిరిలో జరిగింది. భారీ వర్షాలు కురుస్తుండడంతో వరదల తాకిడికి భవనాలు పేకమేడల్లా కూలిపోతున్నాయి. కదిరిలోని పాత చైర్మన్ వీధిలో నాలుగు అంతస్థుల భవనం కూలి రెండు అంతస్థుల భవనంపై పడడంతో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. చిక్కుకున్న పదకొండు మంది రెస్యూ సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా చిత్తూరు, వైఎస్ ఆర్ కడప జిల్లాలో ఇప్పటి వరకు తొమ్మిది మంది మృతి చెందగా 23 మంది గల్లంతైనట్టు సమాచారం.
- Advertisement -