Monday, April 29, 2024

సిద్ధిపేటలో అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వ మెడికల్ కళాశాల, జిల్లా ఏరియా ఆసుపత్రి ఆధ్వర్యంలో అంబులెన్స్ ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు

సిద్ధిపేట: అత్యవసర సమయంలో అంబులెన్సుల సేవలు ఎంతో విలువైనవని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం ఉదయం అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ ను జెండా ఊపి మంత్రి ప్రారంభించి సిద్ధిపేట జిజిహెచ్ కు అప్పగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు మెరుగైన వైద్యం కోసం జిజిహెచ్ సిద్ధిపేట ఆసుపత్రి నుంచి హైదరాబాదు నిమ్స్, గాంధీ, టెరిసరీ ఆసుపత్రులకు తీసుకువెళ్తుందని మంత్రి చెప్పారు.

ఇప్పటికే జిజిహెచ్ ఆసుపత్రిలో సిఎంఆర్, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రెండు చిన్న అంబులెన్స్ లు అత్యవసర సమయంలో సేవలు అందిస్తున్నాయని, అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ ఎమర్జెన్సీ పేషంట్లకు ఎంతగానో ఉపయోగకరమని ఆరోగ్య మంత్రి తెలిపారు. ఈ అంబులెన్స్ లో డ్రైవర్ తో పాటు ఇద్దరూ టెక్నీషియన్లను అందుబాటులో నిలపాలని వైద్యాధికారులను ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ ఆదేశించారు.

జిజిహెచ్ అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ లో ఎన్నో సదుపాయాలు:

అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ లో అత్యాధునిక 45 రకాల పరికరాలు అందుబాటులో ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. డీ ఫిబ్రీలేటర్, స్పెన్ బోర్డు, స్కూప్ స్ట్రెచర్, వీల్ చైర్, బ్యాగ్ మస్క్, మల్టీ పారా మానిటర్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేశారని మంత్రి పేర్కొన్నారు. అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ లలో విషమ పరిస్థితిలో ఉన్న రోగిని ఆసుపత్రికి తరలించే సమయంలో కూడా వైద్య సేవలు అందించేందుకు అత్యాధునిక వెంటిలేటర్లు అమర్చారని ఆరోగ్య మంత్రి హరీశ్ వివరించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 108 వాహనాలు 429 ఉన్నాయని, మరింత మెరుగ్గా 108 సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని ఆరోగ్య మంత్రి హరీశ్ స్పష్టం చేశారు. పాత వాహనాలు తొలగించి అవసరం అయిన చోట కొత్త వాహనాలు కూడా అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైనా సౌకర్యాలు కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని మంత్రి హరీష్‌ రావు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, ఎఫ్ డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, సిద్ధిపేట మార్కెట్ కమిటీ ఛైర్మన్ పాల సాయిరాం, సుడా డైరెక్టర్ మచ్చ వేణుగోపాల్ రెడ్డి, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ తమిళ్ అరసు, సూపరింటెండెంట్ కిషోర్ కుమార్, డయాగ్నోస్టిక్ హబ్ నోడల్ అధికారి డాక్టర్ కాశీనాథ్, వైద్య శాఖ అధికార సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News