Sunday, April 28, 2024

నిత్య జీవనంలో యోగా ఎంతో అవసరం

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : ఆరోగ్యంగా ఉండటం కంటే ముఖ్యమైనది ఏదీ లేదని, అటువంటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయటం తగదని,నిత్య జీవనంలో యోగా ఎంతో అవసరమని జడ్పీ సీఈవో ఇంజం అప్పారావు అన్నారు. బుధవారం ఉపాధ్యాయులు దండా లక్ష్మణరావు, బండి ఉష, నేతృత్వంలో నెలకొల్పిన అరవింద ఉచిత యోగా శిక్షణ కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్పీ సీఈవో ఇంజం అప్పారావు పాల్గొని ప్రసంగిస్తూ సంపూర్ణ ఆరోగ్యానికి శారీరక శ్రమ ఎంతో అవసరమని యోగా ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు అని అన్నారు. గత 17 సంవత్సరాలుగా ఖమ్మం నగరంలో ఉచితంగా యోగా శిక్షణ ఇవ్వడం పట్ల నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు.ప్రతిరోజు శిక్షణ పొందుతున్న వారికి ప్రోత్సాహకంగా సర్టిఫికెట్లను అందజేశారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శీలం శెట్టి రమా వీరభద్రం, అరవింద యోగా ట్రస్ట్ నిర్వహకులు దండా లక్ష్మణరావు, బండి ఉష, ఆత్మజ్యోతి, ఒక్కపుడి శ్రీనివాసరావు, రేణుక, వేముల సీతీష్, రమేష్, శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, ఉదయశ్రీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News