- Advertisement -
చండీగఢ్: పంజాబ్ యువరైతు ఆత్మహత్య చేసుకున్నారు. 22 సంవత్సరాల వయస్సు ఉన్న గుర్లాభ్ సింగ్ ఢిల్లీలో సాగుతోన్న నిరసనల స్థలి నుంచి ఇటీవలే పంజాబ్కు తిరిగి వచ్చారు. ఏదో విషపదార్థం తీసుకుని భటిండా జిల్లాలోని దయాల్పూర మీర్జా గ్రామంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసు వర్గాలు ఆదివారం తెలిపాయి. శుక్రవారమే ఈ రైతు ఢిల్లీ నుంచి స్వగ్రామం చేరాడు. శనివారం ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు కారణాలను నిర్థారించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. పంజాబ్ , హర్యానాలకు చెందిన రైతులు చాలా రోజులుగా వ్యవసాయ చట్టాలకు నిరసనగా ఢిల్లీశివార్లకు చేరుకుని ఉన్నారు. పలువురు రైతులు కుటుంబాలతో పాటు అక్కడనే తిష్ట వేసుకుని ఉన్నారు. చట్టాలు రద్దు అయ్యేవరకూ వెనకకు వెళ్లేది లేదని భీష్మించుకున్నారు.
- Advertisement -