Saturday, May 18, 2024

కూతురుతో అసభ్య ప్రవర్తన… మందలించినందుకు మట్టిలో కలిపాడు

- Advertisement -
- Advertisement -

Young man killed father about Harassment

 

అమరావతి: కూతురితో అసభ్యంగా ప్రవరించాడని మందలించినందుకు ఆమె తండ్రిని యువకుడు హత్య చేసిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం చింతలపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. భాస్కర్ అనే యువకుడు మార్లపూడి సురేష్ కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె వెళ్లి తన తండ్రికి చెప్పడంతో ఆయన నేరుగా వెళ్లి భాస్కర్ తండ్రికి ఫిర్యాదు చేశాడు. తన తండ్రికే చెబుతావా? అని సురేష్ పై భాస్కర్ కర్రతో దాడి చేశాడు. ఈ దాడిలో సురేష్ ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News