Saturday, May 4, 2024

పాన్ ఇండియా మూవీగా ‘రాక్షసుడు2’

- Advertisement -
- Advertisement -

'Rakshasudu 2' Movie shoot begins soon

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రమేష్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘రాక్షసుడు’కి సీక్వెల్ రాబోతోంది. ఇటీవల ‘హోల్డ్ యువర్ బ్రీత్’ అంటూ ‘రాక్ష‌సుడు 2’ పోస్టర్ ను మూవీ మేకర్స్ విడుద‌ల చేశారు. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో ‘రాక్షసుడు 2’ని థ్రిల్లింగ్‌గా హాలీవుడ్‌ స్థాయిలో నిర్మించ‌నున్న‌ట్లు కోనేరు సత్యనారాయణ తెలిపారు. పూర్తిగా లండన్ లోనే చిత్రీకరణ జరుపుకోనున్న మూవీలో ఓ స్టార్ హీరో నటించనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్, శ్రీకాంత్ విస్సా కలిసి సంభాషణలు రాస్తున్నారు. ఈ సినిమాకి ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్ లు యాక్షన్ కొరియోగ్రఫీ, వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు. త్వరలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. కాగా, ప్రస్తుతం డైరెక్టర్ రమేష్ వర్మ, రవితేజతో ఖిలాడి సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

‘Rakshasudu 2’ Movie shoot begins soon

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News