Saturday, April 20, 2024

యువకుడితో ఫోన్ లో మాట్లాడి…. యువతి అదృశ్యం

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/కంటోన్మెంట్ : కళాశాలకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లోనుంచి వెళ్ళిన యువతి ఆదృశ్యమైన సంఘటన బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బోయిన్‌పల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….బోయిన్‌పల్లిలో నివాసముండే రేణుకా 17 సంవత్సరాల క్రితం భర్త చనిపోవటంతో తన సోదరుడు శివుడు (32) ఇంట్లో ఉంటు తన కూతురు కవిత(17)ను అల్వాల్ లయోలా కాలేజీలో ఇంటర్ మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుకుంటుంది. కాగా గత కొంతకాలంగా షాధ్‌నగర్‌కు చెందిన గణేష్(22) తో తరచు ఫోన్‌లో మాట్లాడుతుంది.

విషయం తెలిసిన తల్లి కూతురు కవితను మందలించింది. ఈక్రమ ంలో రోజువారి మాదిరి గురువారం 8గంటల ప్రాం తంలో కళాశాలకు వెళ్తున్నాని ఇంట్లో చెప్పివెళ్లింది. సాయంత్రం అయిన ఇంటికి తిరిగి రాకపోవటంతో కళశాలకు వెళ్లి వాకబు చేయగా అరోజు కాలేజి లేదని తెలిసింది. దీంతో తెలిసినవారు బంధువుల వద్ద వెతికిన ఫలితం లేకపోవటంతో అనుమానం వచ్చిన రేణుకా బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News