Wednesday, May 15, 2024

కేంద్రానికి వ్యతిరేకంగా వినూత్న నిరసన

- Advertisement -
- Advertisement -

Youth Congress stages protest in Nagpur on Fuel price rise

న్యూఢిల్లీ: పెట్రోల్ ధరలు పెరగడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కొందరు యూత్ కాంగ్రెస్ నేతలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినూత్న నిరసనలు చేపట్టారు. నాగపూర్ లోని ఓ పెట్రోల్ బంకు వద్ద చేపట్టిన నిరసనలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. లీటర్ పెట్రోల్ ధర వంద దాటిన ప్రధాని నరేంద్ర మోడీ నిద్రపోతున్నారని అర్ధమయ్యేలా నిరసనలు ప్రదర్శించారు. మోడీ తన ఏడేళ్ల పాలనలో పూర్తిగా విఫలమైనట్టు ఆరోపించిన కాంగ్రెస్ సభ్యులు ఇంధన ధరలు నియంత్రించడం, కరోనా మహమ్మారిని ఎదుర్కొవడంలో పూర్తిగా వైఫల్యం చెందినట్టు ఆరోపించారు. ప్రధాని మోడీ వైఫల్యాన్ని అర్ధ అయ్యేలా ఓ వీధి నాటకాన్ని ప్రదర్శించారు.

Youth Congress stages protest in Nagpur on Fuel price rise

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News