Friday, May 10, 2024

ఘోర రోడ్డు ప్రమాదం: 10మంది దుర్మరణం

- Advertisement -
- Advertisement -

10 Dead in Road Accident in Assam

భువనేశ్వర్‌: అసోంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంగంజ్‌ జిల్లాలోని అసోం-త్రిపుర జాతీయ రహదారి 8పై ఓ ట్రక్కు ఆటోను ఢీకొట్టింది. అతి వేగంతో దూసుకువచ్చిన ట్రక్కు ఢీకొనడంతో ఆటో పూర్తిగా ధ్వంసం అయ్యింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న 10మంది ప్రయాణికుల్లో 9మంది ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించిన తర్వాత మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

10 Dead in Road Accident in Assam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News