- Advertisement -
బీజింగ్: చైనాలో జరిగిన పడవ ప్రమాదంలో పదిమంది చనిపోగా, ఐదుగురు గల్లంతయ్యారు. గ్విజోవ్ రాష్ట్రం లివ్ప్యాన్ష్యు నగరం సమీపంలోని జాంగ్కే నదిలో శనివారం సాయంత్రం పడవ బోల్తా పడిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం నుంచి 31మందిని కాపాడినట్టు వారు తెలిపారు. 40మంది సామర్థమున్న పడవలో ప్రమాదం జరిగినపుడు ఎంతమంది ఉన్నారన్నది స్పష్టంగా తెలియదని వారు తెలిపారు. బాధితుల్లో అధికభాగం విద్యార్థులేనని తెలిపారు. గల్లంతైనవారి కోసం 17 రెస్కూ బృందాలు 50 పడవల్లో గాలిస్తున్నాయని అధికారులు తెలిపారు.
- Advertisement -