చెన్నై: తొమ్మిదో తరగతి బాలికపై పది మంది అత్యాచారం చేయడంతో గర్భం దాల్చిన సంఘటన తమిళనాడులోని కోయంబత్తూరు ప్రాంతంలో జరిగింది. పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సదరు బాలిక తల్లిదండ్రులు భవన నిర్మాన కార్మికులుగా పని చేస్తున్నారు. బాలిక తన తరగతిలో స్నేహితుడితో ప్రేమలో పడింది. బాలికకు మాయ మాటాలు చెప్పి స్నేహితుడు లోబర్చుకున్నాడు. మరో ముగ్గురు స్నేహితులు ఆమెతో స్నేహంగా ఉంటూ ఆమెపై అత్యాచారం చేశారు. చుట్టు పక్కల ఉన్న ఆరుగురు యువకుల ఆమెపై ఆరు నెలల నుంచి పలుమార్లు అత్యాచారం చేశారు. దీంతో సదరు బాలిక గర్భం దాల్చింది. బాలికకు జ్వరం రావడంతో స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె గర్భవతి అని తెలిపారు. అబార్షన్ చేయాలని తల్లిదండ్రులు కోరడంతో వైద్యులు నిరాకరించారు. దీంతో అదే రోజు సాయంత్రం ఆస్పత్రి నుంచి తప్పించుకోవడంతో ఆస్పత్రి వర్గాలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాలికను పట్టుకున్నారు. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమెపై అత్యాచారం చేసిన నలుగురు విద్యార్థులను జువైనల్ హోమ్కు తరలించారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు పేర్కొన్నారు.
10 Members rape on 9th Class student in Tamilnadu