Thursday, May 2, 2024

బిల్డర్ ఆఫీస్‌లో భారీ చోరీ.. 100కోట్ల విలువైన డాక్యుమెంట్లు..

- Advertisement -
- Advertisement -

100 Cr worth documents stolen in Builder Office in Hyd

హైదరాబాద్: తన కార్యాలయంలో కోట్లాది విలువైన భూముల పత్రాలు, రివాల్వర్ చోరీ చేశారని ఓ బిల్డర్ బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బిల్డర్ వీరపరెడ్డి కోటారెడ్డి బంజారాహిల్స్ రోడ్డు నంబర్3లో శ్రీ ఆదిత్య హోమ్స్ ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నాడు. శనివారం తన కార్యాలయానికి వచ్చి చూడగా దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన భూముల పత్రాలు, రివాల్వర్, 20తూటాలు మాయమయ్యాయి. వెంటనే కార్యాలయంలోని సిసిటివి ఫుటేజ్ పరిశీలించగా తన బావమరిది సుధీర్‌రెడ్డి వాటిని చోరీ చేసినట్లు గుర్తించాడు. వెంటనే బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు సుధీర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

100 Cr worth documents stolen in Builder Office in Hyd

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News