Tuesday, May 21, 2024

కొత్తగా 1000 వన నర్సరీలు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హరితహారంతో తెలంగాణలో 24 నుంచి 29 శాతానికి పచ్చదనం పెరిగిందని మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. శాసన సభలో జరుగుతున్న ప్రశ్నోత్తరాల సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. తెలంగాణ కొత్తగా 1000 వన నర్సరీలను ఏర్పాటు చేయబోతున్నామని, జిహెచ్‌ఎంసి పరిధిలోని పార్కుల్లో ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. దేశంలోనే అతిపెద్ద అర్బన్ ఎకో పార్కు మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేశామని వెల్లడించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అర్బన్ పార్కులను అభివృద్ధి చేస్తున్నామని, 1903 అభివృద్ధి చెందిన పార్కులు ఉన్నాయని, ప్రతి మున్సిపాలిటీలో పది శాతం గ్రీన్ బడ్జెట్ ఉండాలని సిఎం కెసిఆర్ చట్టంలో పెట్టారని కెటిఆర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News