Monday, May 20, 2024

ఎపిలో మరో 1,005 మందికి కరోనా

- Advertisement -
- Advertisement -

1005 new covid-19 cases reported in ap

అమరావతి: ఎపిలో కరోనా కేసులు వేగంగా విస్తరిస్తున్నాయి. గడిచిన 24గంటల్లో మరో 1,005 కరోనా కేసులు, రెండు మరణాలు నమోదయ్యాయి. అదే సమయంలో 324 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఆంధ్రలో ప్రస్తుతం 5,394 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 31,342 మందికి కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య శాఖ అధికారులు వెల్లడించారు. ఎపిలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8.95లక్షలు దాటింది. రాష్ట్రవ్యాప్తంగా 7,205 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు ఈ మహమ్మారి బారినుంచి 8.86 లక్షల మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా గుంటూరులో 225, చిత్తూరులో 184, విశాఖలో 167, కృష్ణాలో 135 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గతేడాది నవంబర్ తర్వాత వేయి కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.

1005 new covid-19 cases reported in ap

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News