Sunday, May 5, 2024

దేశంలో కొత్తగా 10,064 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

10064 New Covid 19 Cases Reported in India

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో 10,064 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 17,411 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మరో 137 మంది కరోనాతో మృతి చెందారు. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 1,05,81,837కి చేరింది. ఇండియాలో ప్రస్తుతం 2,00,528 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,02,28,753 మంది బాధితులు కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. భారత్ లో 1,52,556 మంది కరోనా వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది. దేశంలో కరోనా రికవరీ రేటు 96.66శాతం, మరణాల రేటు 1.44 శాతంగా ఉందని అధికారులు వెల్లడించారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 18,78,02,827 కరోనా టెస్టులు నిర్వహించినట్లు ఐసిఎంఆర్ తెలిపింది. నిన్న 7,09,791 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

10064 New Covid 19 Cases Reported in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News