Tuesday, April 30, 2024

ఎల్లుండి నుంచి టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు

- Advertisement -
- Advertisement -

10th Advanced Supplementary Examinations will start from aug1

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పదవ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలకు మొత్తం 55,662 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు ఈ పరీక్షల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 204 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు కృష్ణారావు తెలిపారు. హాల్ టికెట్లను www.bse.telangana.gov.in వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. ఎగ్జామ్స్ ప్రారంభం కంటే 2 రోజుల ముందు కూడా విద్యార్థులు రూ.50 ఆలస్య రుసుంతో పరీక్ష ఫీజు చెల్లించి, ప్రధానోపాధ్యాయుల ద్వారా హాల్ టికెట్‌ను పొందవచ్చని తెలిపారు.

టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్

ఆగస్టు 1 – ఫస్ట్ లాంగ్వేజ్
ఆగస్టు 2 – సెకండ్ లాంగ్వేజ్
ఆగస్టు 3 – థర్డ్ లాంగ్వేజ్(ఇంగ్లీష్)
ఆగస్టు 4 – మ్యాథమేటిక్స్
ఆగస్టు 5 – జనరల్ సైన్స్(ఫిజికల్ సైన్స్, బయాలజీ)
ఆగస్టు 6 – సోషల్ స్టడీస్
ఆగస్టు 8 – ఒఎస్‌ఎస్‌సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -1
ఆగస్టు 10 – ఒఎస్‌ఎస్‌సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News