Tuesday, May 7, 2024

ఎపిలో కొత్తగా 1,184 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

1184 New Covid-19 Cases Reported in AP

అమరావతి: ఎపిలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24గంటల వ్యవధిలో 30,964 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 1,184 మందికి కరోనా వైరస్ సోకింది. కోవిడ్-19తో చిత్తూరు జిల్లాలో ముగ్గురు, నెల్లూరు జిల్లాలో ఒకరు మరణించారు. అదే సమయంలో మరో 456 మంది భాధితులు కోలుకున్నారు. ఎపిలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9లక్షలు దాటింది. రాష్ట్రంలో ప్రస్తుతం 7,338 కరోనా యాక్టివ్ కేసులుండగా, 8.87లక్షల మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 7,217 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నమోదైన కేసుల్లో గుంటూరులో 352, విశాఖలో 186, చిత్తూరులో 115, కృష్ణాలో 113, నెల్లూరులో 78, అనంతపురంలో 66, కర్నూలులో 64, కడపలో 62, శ్రీకాకుళంలో 47, ప్రకాశంలో 45, తూ.గో జిల్లాలో 26, విజయనగరంలో 19, ప.గో 11 కరోనా కేసులు బయటపడ్డాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది.

1184 New Covid-19 Cases Reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News