న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 311 మరణాలు, అత్యధికంగా 11,929 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు 3లక్షల 20వేల 922కి చేరాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 9,195మంది కరోనాతో మృతిచెందారు. దేశంలో ప్రస్తుతం లక్షా 49వేల 348 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 1,62,379 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా కోలుకుంటున్నవారు 50.60 శాతంగా ఉంది. దేశంలో మరణాల 2.87 శాతంగా ఉందని అధికారులు తెలిపారు. అటు మహారాష్ట్ర కోవిడ్ కేసులు 1,04,568 చేరుకున్నాయి. ఇప్పటివరకు 3,830 మందిని కరోనా కబలించింది. ప్రస్తుతం 51,379 యాక్టివ్ కేసులుండగా.. 49,346మంది నయమై కోలుకున్నారు. తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల్లోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. కేసులు భారీగా నమోదవుతున్నాయి.
11929 new covid 19 cases and 311 deaths in india