Saturday, May 4, 2024

ఎపిలో భారీగా పెరుగుతున్న కేసులు.. ఒక్కరోజులోనే 69మంది మృతి

- Advertisement -
- Advertisement -

12634 New Corona Cases Reported in AP

అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఎపిలో గడిచిన 24గంటల్లో 62,885 మందికి పరీక్షలు నిర్వహించగా.. 12,634 మందికి కరోనా వైరస్ సోకినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. కోవిడ్ కారణంగా మరో 69మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలపింది. దీంతో ఆంధ్రలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 10,33,560కి చేరింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో 7,685 మంది మృతి చెందారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో మరో 4,304 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 89,732 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 9,36,143 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

12634 New Corona Cases Reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News