Saturday, May 4, 2024

బెంగళూరు లక్ష్యం 192

- Advertisement -
- Advertisement -

ముంబయి: ఐపిఎల్‌లో భాగంగా వాంఖేడ్ స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో సిఎస్‌కె 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. ఆర్‌సిబి ముందు సిఎస్‌కె 192 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రవీంద్ర జడేజా, డూప్లిసెస్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. తొలి వికెట్‌పై ఓపెనర్లు 74 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రూతురాజ్ గైక్వాడ్ 33 పరుగులు చేసి జేమీసన్ బౌలింగ్‌లో చాహల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఒకే ఓవర్లలో డూప్లెసెస్(50), సురేష్ రైనా (24) పరుగులు చేసి హర్షల్ పటేల్ బౌలింగ్ లో ఔటయ్యారు. అంబటి రాయుడు 14 పరుగులు చేసి హర్షల్ పటేల్ బౌలింగ్‌లో జేమీసన్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. సిఎస్‌కె బ్యాట్స్‌మెన్లలో రవీంద్ర జడేజా (62), ధోనీ(02) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఆర్‌సిబి బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు వికెట్లు పడగొట్టగా యుజేంద్ర చాహల్ ఒక వికెట్ తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News