కొత్తగా 1267 కేసులు, 4 మంది మృతి
జిహెచ్ఎంసి పరిధిలో 201, జిల్లాల్లో 1066 కేసులు నమోదు
2,52,455కి చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో రికవరీ రేట్ 92 శాతానికి పెరిగింది. ఇది దేశ సగటు కంటే అదనంగా రికార్డు కావడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతున్న రికవరీ రేట్ మరే రాష్ట్రంలోనూ తేలడం లేదని అధకారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా సోమవారం 42,490 పరీక్షలు నిర్వహించగా 1267 పాజిటివ్లు తేలాయి.
వీటిలో జిహెచ్ఎంసి పరిధిలో 201 మంది ఉండగా, ఆదిలాబాద్లో 6, భద్రాద్రి 85, జగిత్యాల 23, జనగాం 17, భూపాలపల్లి 15, గద్వాల 5, కామారెడ్డి 23, కరీంనగర్ 53 ,ఖమ్మం 62, ఆసిఫాబాద్ 10, మహబూబ్నగర్ 23,మహబూబాబాద్ 15, మంచిర్యాల 32, మెదక్ 21, మేడ్చల్ మల్కాజ్గిరి 109, ములుగు 23, నాగర్కర్నూల్ 32, నల్గొండ 89, నారాయణపేట్ 3, నిర్మల్ 18, నిజామాబాద్ 40, పెద్దపల్లి 30, సిరిసిల్లా 23, రంగారెడ్డి 104, సంగారెడ్డి 20, సిద్ధిపేట్ 27, సూర్యాపేట్ 42, వికారాబాద్ 16, వనపర్తి 17, వరంగల్ రూరల్ 14, వరంగల్ అర్బన్ లో 45, యాదాద్రిలో మరో 24 మందికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,52,455కి చేరగా, డిశ్చార్జ్ల సంఖ్య 2,32,489కి చేరింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్లో 44 కేంద్రాల్లో ఆర్టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా,1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ తెలిపారు.
ప్రతి పది లక్షల మందిలో లక్షా 25 వేల మందికి పరీక్షలు…
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా టెస్టులు వేగంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రతి పది లక్షల మందిలో లక్షా 25 వేల మందికి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆరోగ్యశాఖ నివేదించింది. రాబోయే రోజుల్లో వీటి సంఖ్యను మరింత పెంచనున్నట్లు హెల్త్ డైరెక్టర్ తెలిపారు.
కొత్త కేసుల కంటే డిశార్జ్లే ఎక్కువ….
గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల కంటే సంపూర్ణ ఆరోగ్యంతో ఇళ్లకు వెళుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ హెల్త్ బులెటెన్లో తెలిపింది. అయితే ఈనెల, డిసెంబరు, జనవరి నెలల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.