- Advertisement -
కాబూల్: అఫ్ఘనిస్థాన్ తూర్పు ప్రాంతంలో శనివారం ఆత్మాహుతి ట్రక్కు బాంబు దాడి తీవ్ర ప్రాణనష్టం కల్గించింది. నన్గార్హార్ ప్రాంతంలోని గనీఖలీ జిల్లాలో సూసైడ్ అటాక్ జరిగి కనీసం 13 మంది ప్రాణాలు తీసింది. దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి తారీఖ్ అరియన్ ఈ విషయాన్ని శనివారం తెలిపారు. ఓ ట్రక్కులో వచ్చిన వ్యక్తి తనను తాను పేల్చుకుని విధ్వంసానికి పాల్పడ్డాడు. ఘటనలో కనీసం 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికంగా ఓ మసీదు వద్ద ప్రజలు నమాజుకు చేరుకుంటూ ఉండగా ఆత్మాహతి దాడి జరిగిందని, ఓ వైపు ఈ బాంబు దాడి జరిపి మరో వైపు పలువురు సాయుధులు అక్కడి ప్రాంతీయ జిల్లా కార్యాలయంలోకి చొచ్చుకుపొయ్యేందుకు యత్నించారు. అయితే పరిస్థితిని గమనించి వారిని అక్కడున్న భద్రతా సిబ్బంది మట్టుపెట్టిందని అధికార ప్రతినిధి తెలిపారు.
13 killed in bomb attack in Afghanistan
- Advertisement -