Wednesday, May 15, 2024

ఎపిలో కొత్తగా 1326 పాజిటీవ్ కేసులు.. 5మంది మృతి

- Advertisement -
- Advertisement -

1326 New Corona Cases Reported in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో ప్రతిరోజూ వెయ్యికి పైగా పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. ఎపిలో గడిచిన 24 గంటల్లో 30,678 శాంపిళ్లను పరీక్షించగా.. కొత్తగా 1326 కరోనా‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య  శాఖ వెల్లడించింది. కరోనాతో మరో 5మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 9,09,002కు చేరింది. ఇప్పటివరకు కారోనాతో 7,244 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10,710 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 911మంది కోలుకోగా, ఇప్పటివరకు రాష్ట్రంలో 8 లక్షల 91వేలకు పైగా బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

1326 New Corona Cases Reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News