Sunday, April 28, 2024

44 లక్షలు దాటిన కోవిడ్ పరీక్షలు

- Advertisement -
- Advertisement -

1637 New Covid Case Reported in Telangana

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య 44 లక్షలు దాటింది. గత ఎనిమిది నెలల నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 44,39,856 మందికి పరీక్షలు చేసినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. అంటే ప్రతి పది లక్షల మందిలో లక్షా 19 వేల 286 మందికి టెస్టులు నిర్వహిస్తున్నామని ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన సంఖ్య కంటే 21 రెట్లు ఎక్కువని అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో వీటి సంఖ్యను మరింత రెట్టింపు చేస్తామని వైద్యశాఖ పేర్కొంది. ఇదిలా ఉండగా మంగళవారం 45,526 మందికి టెస్టులు చేయగా 1637 మందికి పాజిటివ్ తేలింది.

వీటిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 292 ఉండగా ఆదిలాబాద్‌లో 10, భద్రాద్రి 118,జగిత్యాల 37, జనగాం 17, భూపాలపల్లి 22, గద్వాల 14, కామారెడ్డి 37, కరీంనగర్ 90 ,ఖమ్మం 74, ఆసిఫాబాద్ 9, మహబూబ్‌నగర్ 24,మహబూబాబాద్ 23, మంచిర్యాల 26, మెదక్ 19, మేడ్చల్ మల్కాజ్‌గిరి 129, ములుగు 21, నాగర్‌కర్నూల్ 36, నల్గొండ 101, నారాయణపేట్ 5, నిర్మల్ 18, నిజామాబాద్ 36, పెద్దపల్లి 27 , సిరిసిల్లా 36, రంగారెడ్డి 136, సంగారెడ్డి 38, సిద్ధిపేట్ 41, సూర్యాపేట్ 45, వికారాబాద్ 23, వనపర్తి 24, వరంగల్ రూరల్ 20, వరంగల్ అర్బన్ లో 56, యాదాద్రిలో మరో 33 మందికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,44,143కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 2,24,686కి చేరింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్‌లో 44 కేంద్రాల్లో ఆర్‌టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా,1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ తెలిపారు.

రెండు లక్షల 24 వేల మంది కోలుకున్నారు…

రాష్ట్రంలో వైరస్ బారిన పడిన ఇప్పటి వరకు ఏకంగా రెండు లక్షల 24 వేల మంది ఆరోగ్యవంతులుగా మారినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన చికిత్సను అందించడం వలనే ఇది సాధ్యమైనట్లు ఆరోగ్యశాఖ అభిప్రాయపడింది. దీంతో రికవరీ రేట్ కూడా అమాతంగా పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 92.03 శాతం రికవరీ రేట్ నమోదు అయింది. ఇది దేశ సగటు 92.1 కంటే అదనంగా తేలడం గమనార్హం.

44 శాతం ప్రైమరీ కాంటాక్ట్‌లకు పరీక్షలు….

రాష్ట్రంలో ప్రతి రోజూ చేస్తున్న టెస్టుల్లో 44 శాతం ప్రైమరీ కాంటాక్ట్‌లకు, 12 శాతం సెకండరీ కాంటాక్ట్‌లకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.పాజిటివ్ తేలిన వారి కుటుంబ సభ్యుల్లో లక్షణాలు లేకున్నా టెస్టులు చేస్తున్నామని హెల్త్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News