- Advertisement -
అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 75,465 మందికి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా 2,477 మందికి కోవిడ్ నిర్ధారణ అయింది. ఈ వైరస్ బారిన పడి 10 మంది మృతి చెందారు. అదే సమయంలో 2,701 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8 లక్షల 33,208కి చేరింది. ఆంధ్రలో ఇప్పటివరకు కరోనాతో 6,744 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 21,438 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మహమ్మారి నుంచి కోలుకుని 8లక్షల 5వేల 26మంది కోలుకుని నయమైయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 83,42,265 మందికి కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య అధికారులు వెల్లడించారు.
2477 New Covid-19 Cases Reported in AP
- Advertisement -