Monday, May 20, 2024

భార‌త్‌లో కొత్తగా 17,921 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

17921 New Covid1-19 Cases Reported in India

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 17,921 మందికి కరోనా వైరస్ సోకింది. అదే సమయంలో 20,652 మంది కోలుకోగా, 133 మంది కరోనాతో చనిపోయారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,12,62,707కి పెరిగింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,58,063 మంది మృతిచెందారు. భారత్ లో కరోనా మహమ్మారి నుంచి  1,09,20,046 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 1,84,598 కరోనా యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా, ఇండియాలో మంగళవారం వరకు మొత్తం 22,34,79,877 కోవిడ్-19 టెస్టులు చేశారు. నిన్న 7,63,081 మంది శాంపిళ్లను పరీక్షించినట్టు ఐసిఎంఆర్ ప్రకటించింది.

17921 New Covid1-19 Cases Reported in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News