Wednesday, May 8, 2024

ఎపిలో కొత్తగా 120 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

120 New Covid 19 Cases Reported in AP

అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 48,973 మందికి పరీక్షలు నిర్వహించగా, 120 మందికి కరోనా వైరస్ సోకింది. ఒకరు మరణించారు. అదే సమయంలో మరో 93 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,91,004 కి చేరింది. ఇప్పటివరకు 8,82,763 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 1064 కరోనా యాక్టివ్ కేసులుండగా.. 7,177 మంది బాధితులు కరోనాతో మృత్యువాత పడ్డారని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News