- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు గత రెండు రోజులతో పోలిస్తే సోమవారం కాస్త తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24గంటల్లో 1,15,275 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 18,972 మందికి కరోనా వైరస్ సోకింది. మరో 71 మంది వైరస్ తో మృతి చెందారు. అదే సమయంలో 10,227 మంది బాధితులు కోలుకున్నారు. ఆంధ్రలో ప్రస్తుతం 1,51,852 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 11,61,099కి చేరాయి. ఇప్పటివరకు 10,01,040 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 8,207 మంది కోవిడ్-19తో మృతి చెందినట్టు వైద్యఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.
18972 New Covid-19 Cases Reported in AP
- Advertisement -