Friday, May 3, 2024

మే 5న దీదీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం..

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: పశ్చిమ్ బెంగల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌(టిఎంసి), 292 స్థానాలకు గానూ 215 స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటింది. దీంతో బెంగాల్ లో మరోసారి టిఎంసి అధినేత్రి మమత బెనర్జీ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగా బుధవారం పార్టీ శాసనసభ పక్ష నాయకురాలిగా మమత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో మే 5వ తేదీన దీదీ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మే 6న మంత్రవర్గం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు టిఎంసి పార్టీ సీనియర్‌ నాయకుడు పార్థచటర్జీ పేర్కొన్నారు. కాగా, నందిగ్రామ్‌లో స్వల్ప మెజారీటితో ఓడిపోయిన మమత.. రీకౌంటింగ్‌ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

Mamata Banerjee to take oath as Bengal CM on May 5

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News