Sunday, May 5, 2024

20మంది కరోనా రోగులు పరారు..

- Advertisement -
- Advertisement -

తెహ్రీ: ఏం కష్టం వచ్చిందో తెలియదు కానీ.. కొవిడ్ చికిత్సా కేంద్రం నుంచి 20మంది రోగులు పారిపొయ్యారు. ఈ పరారీ ఘటన ఉత్తరాఖండ్‌లోని తెహ్రీలో చోటుచేసుకుంది. చికిత్సా కేంద్రం అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ఆరంభించారు. స్థానిక నరేంద్ర నగర్‌లోని కొవిడ్ కేర్ సెంటర్‌కు రాత్రిపూట వార్డుల సందర్శనకు వచ్చిన డాక్టర్లకు కొందరు రోగులు బెడ్‌ల మీద కన్పించలేదు. తరువాత ఆరా తీస్తే మొత్తం 38 మందిలో 18 మంది ఉన్నట్లు, 20 మంది పారిపోయినట్లు గుర్తించామని ప్రధాన వైద్యాధికారి సుమన్ ఆర్య తెలిపారు. చికిత్స కేంద్రం నుంచి తప్పించుకున్న వారిలో ఇద్దరు ఉత్తరాఖండ్ వారు. మిగిలిన వారు ఇతర రాష్ట్రాలు అయిన యుపి, రాజస్థాన్, హర్యానా, ఒడిషాకు చెందిన వారిగా గుర్తించారు. విపత్తు నిర్వహణ, అంటువ్యాధుల నియంత్రణ చట్టం పరిధిలో కేసు దాఖలు అయింది. కరోనా రోగుల పరారీ ఘటనతో ఆసుపత్రి వద్ద తగు విధంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

20 Patients escape from Covid Centre in Uttarakhand

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News