Friday, May 24, 2024

చెలరేగిన శిఖర్.. ఢిల్లీ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

IPL 2021: DC win by 6 wickets against PBKS

ముంబై: ఐపిఎల్‌ 2021‌లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన 196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు 18.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి సునాయసంగా గెలుపొందింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(92) మెరుపు మెరిపించాడు. మరో ఓపెనర్ పృథ్వీ షా(32), స్టాయినీస్‌(27)లు రాణించడంతో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. పంజాబ్‌ బౌలర్లలో జే రిచర్డ్‌సన్‌ రెండు వికెట్లు తీయగా.. రిలే మెరిడిత్‌, అర్షదీప్‌ సింగ్‌ చెరో వికెట్‌ తీశారు.

అంతకుముందు పంజాబ్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌(61), మయాంక్ అగర్వాల్‌(69) హాఫ్‌ సెంచరీలతో అలరించారు. చివర్లో దీపక్‌ హుడా(22 నాటౌట్‌), షారుక్‌ ఖాన్‌(15 నాటౌట్‌)లు రాణించారు. ఢిల్లీ బౌలర్లలో క్రిస్‌ వోక్స్‌, మెరీవాలా, రబాడ, ఆవేశ్‌ ఖాన్ తలో వికెట్‌ తీశారు.

IPL 2021: DC win by 6 wickets against PBKS

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News