Saturday, May 4, 2024

నాలుగు విమానయాన సంస్థలపై ఢిల్లీ ప్రభుత్వం కేసు

- Advertisement -
- Advertisement -

Delhi Govt filed cases against 4 Airlines

న్యూఢిల్లీ: మహారాష్ట్ర నుంచి వస్తున్న ప్రయాణికులకు ఆర్‌టి పిసిఆర్ పరీక్షలు నిర్వహించడంలో విఫలమయ్యారన్న ఆరోపణపై నాలుగు విమానయాన సంస్థలపై ఢిల్లీ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఇండిగో, విస్తారా, స్పైస్‌జెట్, ఎయిర్ ఏషియా సంస్థలపై ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది. ఢిల్లీలో అడుగుపెట్టే ఏ ప్రయాణికునికైనా ఆర్‌టి పిసిఆర్ నెగిటివ్ రిపోర్టు ఉండాల్సిందేనని గత వారం ఢిల్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నెగిటివ్ రిపోర్టు లేకుండా వస్తే వారిని 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచుతామని హెచ్చరించింది.

Delhi Govt filed cases against 4 Airlines

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News