Tuesday, April 30, 2024

రాజస్థాన్‌లోని ఒకే గ్రామంలో కరోనాతో 21మంది మృతి

- Advertisement -
- Advertisement -

21 people were killed with Corona in Rajasthan

కరోనా మృతుడి అంత్యక్రియల్లో పాల్గొనడం వల్లే దారుణం

జైపూర్: కొవిడ్19 నిబంధనలు పాటించకపోవడం వల్ల ఓ గ్రామంలో కొన్ని రోజుల్లోనే 21మంది కరోనా బారిన పడి మృతి చెందిన ఉదంతం రాజస్థాన్‌లో వెలుగు చూసింది. షికార్ జిల్లా ఖీర్వా గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది. కొవిడ్19తో మృతి చెందిన ఓ వ్యక్తికి ఏప్రిల్ 21న ఆ గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు దాదాపు 150మంది హాజరయ్యారు. వారిలో చాలామంది కరోనాతో చనిపోయిన వ్యక్తి శవాన్ని తాకారు. వారిలో పలువురు కరోనా బారిన పడగా, 21మంది చనిపోయారు. అయితే, ఏప్రిల్ 15 నుంచి మే 5 వరకు ఆ గ్రామంలో కరోనా వల్ల చనిపోయింది నలుగురేనని అధికారులు చెబుతున్నారు. మిగతావారు వృద్ధాప్య సమస్యలతో చనిపోయారని తెలిపారు. కాగా, 20మందికిపైగా చనిపోయారని, పలువురు ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారని స్థానిక కాంగ్రెస్ ఎంఎల్‌ఎ, ఆ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు గోవింద్‌సింగ్ డోటాస్రా ట్విట్ చేయడం గమనార్హం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News