Tuesday, May 21, 2024

ఎపిలో మరో 21,320 మందికి వైరస్

- Advertisement -
- Advertisement -

21320 new covid-19 cases reported in ap

అమరావతిం: ఎపిలో కరోనా అల్లాకల్లోలం సృష్టిస్తోంది. గడిచిన 24గంటల వ్యవధిలో 91,253 కరోనా టెస్టులు చేయగా 21,320 మందికి కరోనా వైరస్ సోకింది. అదే సమయంలో 21,274 మంది కోలుకున్నారు. మరో 99 మందిని కరోనా కబలించింది. ఆంధ్రలో ఇప్పటివరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14,75,372కి చేరింది. 12,54,291 మంది బాధితులు కోలుకుని ఢిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,11,501 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఎపిలో మొత్తం మరణాల సంఖ్య 9,580కి పెరిగింది. తాజాగా చిత్తూరు, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో 10 మంది చొప్పున కోవిడ్-19తో మృతిచెందారు. కొత్తగా నమోదైన కేసుల్లో తూర్పు గోదావరి జిల్లాలో 2,923, అనంతపురం జిల్లాలో 2,804 కేసులు, చిత్తూరు జిల్లాలో 2,630 కేసులు, విశాఖ జిల్లాలో 2,368 కేసులు బయటపడ్డాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

21320 new covid-19 cases reported in ap

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News