Tuesday, April 30, 2024

ఎపి@22 వేల కరోనా కేసులు… 96 మంది మృతి

- Advertisement -
- Advertisement -

22 Thousand corona positive cases in Andhra Pradesh

 

అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కరోనా వైరస్ చాపకింద నీరులా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించి ఉంది. గత 24 గంటల్లో 22,018 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 96 మంది చనిపోయారని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు ఎపిలో కరోనా కేసులు 13.88 లక్షలకు చేరుకోగా 9173 మంది మృత్యువాతపడ్డారు. కరోనా వ్యాధి నుంచి 11.75 లక్షల మంది కోలుకోగా 2.03 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు.  అనంత‌పురంలో 11 మంది, తూర్పు గోదావ‌రి, ప‌శ్చిమ గోదావ‌రి, విశాఖ‌ప‌ట్నంలో 10 మంది చొప్పున‌, విజ‌య‌న‌గ‌రంలో 9 మంది, చిత్తూరు, కృష్ణ‌లో 8 మంది చొప్పున‌, గుంటూరు, నెల్లూరులో ఏడుగురు చొప్పున‌, క‌ర్నూలు, శ్రీ‌కాకుళంలో ఆరుగురు చొప్పున‌, క‌డ‌ప‌లో న‌లుగురు చనిపోయారు. 1.7 కోట్ల మంది కరోనా టెస్టుల చేశామని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News