Tuesday, April 30, 2024

రాష్ట్ర ప్రభుత్వానికి నాట్కో ఫార్మా భారీ విరాళం

- Advertisement -
- Advertisement -

Natco Pharma huge Donation to Telangana

 

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నాట్కో ఫార్మా భారీ విరాళం అందజేసింది. కరోనా నియంత్రణకు ఉపయోగించే బారిసిటినిబ్ మాత్రలను విరాళంగా ఇచ్చింది. ఈ మేరకు సంబంధిత పత్రాన్ని నాట్కో సిఇఒ రాజీవ్ నన్నపనేని శుక్రవారం ప్రగతిభవన్‌లో మంత్రి కెటిఆర్‌కు అందజేశారు. ఒక లక్ష మంది కరోనా రోగులకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ మాత్రలను అందజేయనున్నారు. రూ. 4.2 కోట్లు విలువ గల మాత్రలు ప్రభుత్వానికి విరాళంగా ఇస్తున్నట్లు నాట్కో ఫార్మా కంపెనీ తెలిపింది. ఈ సందర్భంగా నాట్కో సంస్థకు మంత్రి కెటిఆర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News