Tuesday, April 30, 2024

కరోనా పాజిటివ్… బావిలో దూకిన ఓ కుటుంబం…

- Advertisement -
- Advertisement -

Family members commit suicide in andhra

అమరావతి: కొందరు  కరోనా భయంతో చనిపోతుందటే, మరి కొందరిని కరోనా బలి తీసుకుంటుంది. కొందరు కరోనా భయంతో ఆత్మహత్య చేసుంటున్నారు. ఓ కుటుంబానికి మొత్తం కరోనా వైరస్ సోకిందనే తెలియగానే వారు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా వేపాడ మండలం నల్లబెల్లి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నల్లబెల్లి గ్రామంలో ఓ కుటుంబంలో తల్లిదండ్రులతో పాటు కుమారుడు, కోడలుకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. నాలుగు రోజుల తరువాత వారు తీవ్ర మనోవేధనకు గురై బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News