Wednesday, May 1, 2024

కరోనాతో ఆప్ మాజీ ఎంఎల్ఎ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Former Delhi MLA Jarnail Singh passes away

 

ఢిల్లీ: ఆప్‌ మాజీ ఎమ్మెల్యే జర్నైల్‌ సింగ్‌ (48) కరోనాతో క‌న్నుమూశారు. తొమ్మిది రోజుల క్రితం కరోనా సోకడంతో ఆస్పత్రిలో చేరారు. ఐసియులో చికిత్స పొందుతూ జర్నైల్ సింగ్ తుదిశ్వాస విడిచారు. సంవత్సరం క్రితం ఓ మతాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో జర్నైల్ పోస్టు చేయడంతో అతడిని ఆప్ పార్టీ సస్పెండ్ చేసింది. 2009లో అప్పటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పి చిదంబరంపై జర్నైల్ షూ విసరడంతో సంచలనం సృష్టించింది. జర్నలిస్టు  విధులకు స్వస్థ పలికి ఆప్ పార్టీలో చేరారు. జర్నైల్ మృతిపట్ల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News