Friday, May 10, 2024

దేశంలో మళ్లీ పెరిగిన పాజిటీవ్ కేసులు, మరణాలు..

- Advertisement -
- Advertisement -

22431 New Corona Cases Reported in India

న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంట‌ల్లో కొత్తగా 22,431 క‌రోనా పాజిటివ్ కేసులు కొత్త‌గా న‌మోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. ఇక, కరోనాతో మరో 318మంది బాధితరులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 3.39కోట్లు దాటింది. ఇప్పటివరకు దేశంలో కరోనాతో 4,49,856 మంది బాధితులు మరణించారు. గత 24 గంటల్లో 24,602మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3.32కోట్లకు పైగా మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 2,44,198 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 92.63కోట్ల వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.

22431 New Corona Cases Reported in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News