ఛండీగఢ్: హర్యానాలోని పానిపట్ ప్రాంతంలో పరువు హత్య జరిగింది. కులాంతర వివాహం చేసుకున్నాడని యువకుడిని కత్తులతో పొడిచి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. నీరజ్ అనే యువకుడు కోమల్ అనే యువతి ప్రేమించుకున్నారు. కోమల్ కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా నవంబర్ 2020న నీరజ్ ను పెళ్లి చేసుకుంది. దీంతో కోమల్ కుటుంబ సభ్యులు నీరజ్ తక్కువ కులానికి చెందిన వ్యక్తి అని అతడిని హత్య చేయాలని ప్లాన్ వేశారు. బావానా చౌక్ ప్రాంతంలో మార్కెట్కు నీరజ్ వెళ్తుండగా కోమల్ సహోదరుడు, బంధువు ఇద్దరు కలిసి అతడిని పలుమార్లు కత్తులతో పొడిచి పారిపోయారు. ఈ ఘటన మొత్తం సిసి కెమెరాలో రికార్డు అయింది. ఘటనా స్థలంలో అతడు చనిపోయాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి దేహానికి పోస్టుమార్టమ్ నిర్వహించగా 12 కత్తులు పోట్లు ఉన్నట్టు పేర్కొన్నారు. రోహటాక్ ప్రాంతంలో పెళ్లి చేస్తామని నమ్మించి ప్రేమజంటను అమ్మాయి తరపు బంధువులు గన్ షూట్ చేసి చంపేసిన విషయం తెలిసిందే.