- Advertisement -
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా కేేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 24,010 మందికి కోవిడ్-19 సోకింది. అదే సమయంలో 33,291 మంది కోలుకున్నారు. కరోనాతో మరో 355 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 99,56,558కు పెరిగింది. దేశవ్యాప్తంగా 1,44,451 మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఇండియాలో ఇప్పటివరకు 94,89,740 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా.. ప్రస్తుతం 3,22,366 మంది చికిత్స పొందుతున్నారు. భారత్ లో నిన్నటి వరకు మొత్తం 15,78,05,240 కరోనా టెస్టులు చేసినట్టు ఐసిఎంఆర్ వెల్లడించింది. నిన్న 11,58,960 మంది బాధితులకు పరీక్షలు చేసినట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.
24 010 New Covid-19 Cases Reported in India
- Advertisement -