Saturday, April 27, 2024

కొత్తగా 247 కొవిడ్ కేసులు

- Advertisement -
- Advertisement -

247 covid cases reported in Telangana

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా 247 కొవిడ్ కేసులు నమోదుయ్యాయి. గడిచిన 24 గంటల్లో 24,686 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా… 247 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,95,819కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. తాజాగా కరోనా నుంచి 116 మంది కోలుకోగా, ఇప్పటివరకు 7,89,796 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 99.24 శాతంగా నమోదైంది. మరో 609 మంది ఫలితాలు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,912 యాక్టివ్ కేసులు ఉన్నాయి. హైదరాబాద్‌లో అత్యధికంగా 157 కొవిడ్ కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 60 కేసులు నమోదయ్యాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News