Tuesday, May 7, 2024

తెలంగాణలో మరో 253 మందికి వైరస్

- Advertisement -
- Advertisement -

253 new covid-19 cases reported in telangana

హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 253 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 61 మంది ఉండగా, ఆదిలాబాద్‌లో 4, భద్రాద్రి 7 , జగిత్యాల 7, జనగాం 2, భూపాలపల్లి 4, గద్వాల 1, కామారెడ్డి 3, కరీంనగర్ 14, ఖమ్మం 7, ఆసిఫాబాద్ 4, మహబూబ్‌నగర్ 6, మహబూబాబాద్ 4, మంచిర్యాల 9, మెదక్ 2, మేడ్చల్ మల్కాజ్‌గిరి 18, ములుగు 5, నాగర్‌కర్నూల్ 6, నల్గొండ 10, నారాయణపేట్ 0, నిర్మల్ 3, నిజామాబాద్ 4, పెద్దపల్లి 7, సిరిసిల్లా 4, రంగారెడ్డి 17, సంగారెడ్డి 3, సిద్ధిపేట్ 2, సూర్యాపేట్ 4, వికారాబాద్ 3, వనపర్తి 4, వరంగల్ రూరల్ 3, వరంగల్ అర్బన్ లో 20, యాదాద్రిలో మరో ఐదుగురికి వైరస్ సోకిందని ఆరోగ్యశాఖ పేర్కొంది. అదే విధంగా వైరస్ దాడిలో ముగ్గురు మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,87,993కి పెరగగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 2,81,400లకు చేరింది. అయితే ప్రస్తుతం 5039 యాక్టివ్ కేసులుండగా, వీరిలో ఏకంగా 2793 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్‌లో 44 కేంద్రాల్లో ఆర్‌టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా,1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు తెలిపారు.

97.71 శాతానికి పెరిగిన రికవరీ….

రాష్ట్రంలో కరోనా రికవరీ రేట్ రోజురోజుకి పెరుగుతోంది. వైరస్ బారిన పడ్డ ప్రతి వందలో సుమారు 97 మంది సులువుగా కోలుకుంటున్నారని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించడం వలనే ఇది సాధ్యమవుతున్నట్లు ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకులు డా జి శ్రీనివాసరావు పేర్కొన్నారు. దీంతోనే రాష్ట్రంలో మరణాల సంఖ్య అతి తక్కువగా తేలుతోంది. ఇప్పటి వరకు వైరస్ దాడిలో 1554 మంది చనిపోయినట్లు ఆరోగ్యశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన దగ్గర వైరస్ తీవ్రత అతి తక్కువగా ఉందని అధికారులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News