Tuesday, May 21, 2024

కేరళలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో మళ్లీ కరోనా పాజిటీవ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కేరళలో గడిచిన 24 గంటల్లోనే 2,791 కరోనా పాజిటీవ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కారణంగా ఒక్కరోజే 16మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 10,75,576 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇక, కరోనా మొత్తం 4,287మంది బాధితులు మరణించారు. గత 24 గంటల్లో 3,517మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు 10,27,826మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం కేరళలో 42,819 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కేరళలో ఇప్పటివరకు కోటీ 18 లక్షలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి కెకె శైలజ పేర్కొంది.

2791 new corona cases reported in Kerala in last 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News